చిత్రం న్యూస్, సిద్దిపేట : అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ద్యావర మల్లేశం కుటుంబానికి మహిపాల్ యాదవ్ 50 కిలోల బియ్యం అందజేసి ఉదారత చాటారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ సూచన మేరకు 3వ వార్డు సభ్యులు మహిపాల్ యాదవ్ బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.