Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు 

చిత్రం న్యూస్, సిద్దిపేట: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు తోడ్పడుతుందని సిద్ధిపేట డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. బొప్పాపూర్ గ్రామంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు తోడ్పడటమే కాకుండా ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని తెలిపారు. సాంకేతికతను వినియోగించి గ్రామాలను మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామ భద్రతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బొప్పాపూర్ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటు జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ రాజేష్ భూంపల్లి, ఎస్‌ఐ హరీష్పా గౌడ్,.ఉప సర్పంచ్ కోనాపురం పద్మ, వార్డ్ సభ్యులు, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments