ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
చిత్రం న్యూస్, తొగుట: మండలంలోని జెప్తి లింగారెడ్డిపల్లె గ్రామంలో యెన్నం నాగవ్వ కిష్టారెడ్డి దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నాగవ్వ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడికి ఇళ్లు అందించడమే మా ప్రజా పాలన లక్ష్యం అని, విడతలవారీగా నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చూడటమే నా కర్తవ్యం...