చిత్రం న్యూస్, తొగుట: మండలంలోని జెప్తి లింగారెడ్డిపల్లె గ్రామంలో యెన్నం నాగవ్వ కిష్టారెడ్డి దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నాగవ్వ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడికి ఇళ్లు అందించడమే మా ప్రజా పాలన లక్ష్యం అని, విడతలవారీగా నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చూడటమే నా కర్తవ్యం అని అన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్),మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి,సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య, సర్పంచులు కనకయ్య, పాగల శోభా కొండల్ రెడ్డి,గొడుగు జయమ్మ నర్సింలు,ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బిక్షపతి,చందా సత్తయ్య,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి,బుస నిరంజన్ రెడ్డి,పంది రాజు, బండారు రమేష్ గౌడ్,సోలిపేట ప్రసాద్ రెడ్డి,బక్కన్న గారి సంపత్ రెడ్డి, మహ్మద్ షఫీ,స్వామి గౌడ్,చందా రవి,బాలరాజు,తిరుమల్జ, ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.