Chitram news
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 4:01 pm Editor : Chitram news

భానుశర్మ కుటుంబానికి ఎంపీ రఘునందనరావు పరామర్శ 

చిత్రం న్యూస్, దుబ్బాక: భానుశర్మ కుటుంబాన్ని ఎంపీ రఘునందనరావు శనివారం పరామర్శించారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చౌదర్పల్లి గ్రామ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు దుబ్బరాజేశ్వరం శర్మ పరమపదించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ MP రఘునందరావు పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. చౌదర్పల్లి గ్రామ సర్పంచ్ కొత్త నాగరాజు గౌడ్ , ఉప సర్పంచ్ బండారి ఎల్లం, భగత్ సింగ్ యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.