చిత్రం న్యూస్, సిద్దిపేట: అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో మురుగు కాలువలు, మంచినీటి సరఫరా వ్యవస్థను సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. గ్రామంలో పారిశుద్ధ్యం మొరుగుపరచాలని, ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆరో వార్డ్ మెంబర్ నీల బాలమని, ఐతం మల్లేశం, పంచాయతీ కార్యదర్శి మమత, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

