చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలంలోని బెల్లూరి గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరింది. రవాణా సౌకర్యాల మెరుగుదలే ధ్యేయంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ర్ శంకర్ సహకారంతో బెల్లూరి గ్రామానికి సోమవారం నుండి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సదుపాయం వల్ల ముఖ్యంగా పైచదువులకు వెళ్లే విద్యార్థులకు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే కూలీలకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బస్ సౌకర్యం కోసం సహకరించిన డిపో మేనేజర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సర్పంచ్ ,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.