Chitram news
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 12:59 pm Editor : Chitram news

కామారెడ్డి ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా జైనథ్‌లో రాస్తారోకో

చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని, బాన్సువాడలో చెలరేగిన అల్లర్లను నిరసిస్తూ సోమవారం బీజేపీ నాయకుల, కార్యకర్తలు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటకు పైగా బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధిపై, ఆయన కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని, బాన్సువాడలో సామాన్యుల ఆస్తుల విధ్వంసానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపి పార్టీ అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ సంతోష్ యాదవ్, బీజేపీ నాయకులు వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, అశోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.