Chitram news
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 5:53 pm Editor : Chitram news

వైభవంగా సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ విగ్రహాల ప్రతిష్టాపన

చిత్రం న్యూస్,బేల: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పిట్ గావ్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. హోమం, వేద మంత్రోచ్ఛరణల నడుమ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన బంజారాలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. బంజారాల మండల అధ్యక్షులు జాదవ్ విలాస్ మాట్లాడుతూ.. గ్రామస్థులందరి సహాయ సహకారంతో రూ.40 లక్షలతో మందిరం నిర్మించుకున్నామన్నారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరికి భక్తి అవసరమని ఆయన సూచించారు.శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆశీస్సులు తమ గ్రామం పై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరారు. అనంతరంఏర్పాటు చేసిన మహా అన్నదానంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.