నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ బీజేపీ: చిలుకూరి జ్యోతి రెడ్డి
ఆదిలాబాద్, చిత్రం న్యూస్: భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేస్తుందని, పదవుల కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ నాయకురాలు చిలుకూరి జ్యోతి స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ..ఆదిలాబాద్ మున్సిపాలిటీ పీఠం అనూహ్య పరిణామాల మధ్య చేజారిపోవడం పట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆమె పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం బీజేపీకి మున్సిపల్ పీఠం దక్కాలని ఆశించిన వారు ప్రస్తుతం బాధలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు....