ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిరుపేద ఖైదీలు డిఫెన్స్ కౌన్సిల్ ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్ అన్నారు.శనివారం జిల్లా జైలును జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో సందర్శించారు. న్యాయాన్ని పొందే విధానాన్ని ఖైదీలకు వివరించారు. ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఉమేష్ రావు డోలె, రూపేష్, డిప్యూటీ జైలర్ ప్రకాష్ ఉన్నారు.