Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

కాంగ్రెస్ ప్రచార రథాలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆసిఫాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ప్రచార రథాలను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంమన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆసిఫాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు ప్రతి వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments