చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 42వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్తి స్వాతి మంగేష్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఓటర్ల ను కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని 42 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వాతి మంగేష్ కు మద్ధతుగా బుధవారం గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్తించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.

