సిర్సన్న సింగపూర్ హనుమాన్ మందిరంలో చోరీ
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న సింగపూర్ గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ మందిరంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని దుండగులు మందిరం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, హుండీని ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. బుధవారం ఉదయం మందిరానికి వచ్చిన భక్తులు, మందిర పూజారి తలుపులు తెరిచి ఉండటం, హుండీ పగిలిపోయి ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే గ్రామస్తులు, పూజారి పోలీసులకు సమాచారం అందించారు.