Chitram news
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 8:28 pm Editor : Chitram news

శబరిమాత ఆలయ రెండో వార్షికోత్సవం

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామంలో శబరిమాత ఆలయ 2వ వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఉదయం అరు గంటలకు గీతా పారాయణం, హారతి, మంత్రపుష్పం, యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భజన బృందాల సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు. పల్లకీ ఊరేగింపు పురవీధుల గుండా చేపట్టగా భజన బృందం  సభ్యులుభక్తి పాటలతో నృత్యాలతో శబరిమాత వార్షికోత్సవాన్ని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంన్నారు.  ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.