చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో బుధవారం సర్పంచ్ మాలేగం మధుప్రీతి వీధిదీపాలకు కొత్త ఎల్ఈడీ బల్బులు అమర్చారు. రాత్రి సమయంలో గ్రామంలో వెలుతురు కొరత లేకుండా ప్రజలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పనిచేయని బల్బుల స్థానంలో నూతన బల్బులను అమర్చారు. ఉప సర్పంచ్ కో ప్లే నాగనాథ్, మాజీ సర్పంచ్ దేవేందర్, గ్రామస్తులు ఉన్నారు.