చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాదవ్ రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్ఐ సాయిరాం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మండల కేంద్రంలో కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్ర రాజు, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్ రావు, సతీష్, సుమన్, మూర్తి మాంగుర్ల గ్రామ సర్పంచ్ ఆడ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

మరోపక్క బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన గావించారు. బీజేపీ నాయకులు పోతురాజు రమేష్, అస్తక్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
