చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీ సేవ కేంద్రం అవార్డును సోమవారం అందజేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల్లో నిర్వహించిన ఆధార్, ధ్రువపత్రాల సేవలు అందుంచినందుకుగాను జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీసేవ కేంద్రంగా అవార్డును అందజేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా మీసేవ నిర్వాహకుడు గడుగు సురేందర్ కు ప్రశంసా పత్రం అంజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఈడీఎం బండి రవి తదితరులు ఉన్నారు.