చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో న్యాయవాదులకు ఇటీవల నిర్వహించిన షటిల్, బాడ్మింటన్, క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డికి సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, తేజస్విని, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, హుస్సేన్, ఇతర న్యాయవాదులు తదితరులు ఉన్నారు.

