చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండల కేంద్రంలోని సినిమా టాకీస్ వద్ద కొట్టాల పోచమ్మ అమ్మవారికి ఆదివారం గ్రామస్తులు బోనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతులతో తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మ వారిని ప్రార్థిస్తూ మొక్కులు తీర్చుకున్నార. బోనాలు సమర్పించారు. సల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు.

