చిత్రం న్యూస్, సాత్నాల: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సాత్నాల మండలం మేడిగుడ (ఆర్ ) గ్రామంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ జాదవ్ రామారావు, గ్రామ సర్పంచ్ పర్చాకే లక్ష్మి, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేపట్టారు. వయసు పైబడిన వారిని ఘనంగా సన్మానించారు.

