Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

క్రికెట్ ఆడి..పోటీ ప్రారంభించి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా  ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో న్యాయవాదులకు నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. తొలుత టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. పరిచయం చేసుకొని కరచాలనం చేశారు. అనంతరం సరదాగా క్రికెట్ ఆడి అలరించారు. అంపైర్ గా న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, తేజస్విని, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, హుస్సేన్,  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, న్యాయవాదులు రమణా రెడ్డి, దేవేందర్ సింగ్, కరుణాకర్, ముజాహిద్ హుస్సేన్ తదతరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments