చిత్రం న్యూస్, బేల: మహిళల ఆత్మ గౌరవాన్ని చాటాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా శక్తి ద్వారా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామ మహిళలకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ తో కలిసి శుక్రవారం ఈ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి వారితో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు అండగా ఉంటుందన్నారు. మహిళా శక్తి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లోను ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించి మరిన్ని సేవలందించేందుకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు వినోద్, మంచికంటి సాయి, మంచికంటి ఉషన్న,సిద్రప్ సునిల్, గెడం సతీష్,రనీల్,బేల మండల యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ నర్సారెడ్డి,సుధాకర్,సునీల్ తదితరులు ఉన్నారు.

