Chitram news
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 10:18 pm Editor : Chitram news

గ్రామపంచాయతీ కోసం భూదానం చేసిన సర్పంచ్ అడప నవీన్ కుమార్

చిత్రం న్యూస్, బోథ్:బోథ్ మండలంలోని నక్కలవాడ గ్రామపంచాయతీ నూతన భవనానికి గ్రామ సర్పంచ్ అడప నవీన్ కుమార్ భూమిని విరాళంగా అందజేశారు. బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డితో కలిసి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి మాట్లాడుతూ తన సొంత ఇంటి స్థలాన్ని గ్రామపంచాయతీ భవనానికి కేటాయించడం అభినందనీయమని, త్వరలోనే నక్కలవాడ గ్రామపంచాయతీ పరిధిలో గల రోడ్డు సమస్య, హై లెవెల్ వంతెన కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ భవనానికి తన సొంత స్థలాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చట్ల ఉమేష్, అందూర్ గ్రామ సర్పంచ్ పెందూర్ పృథ్వీరాజ్, మర్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ తలంపుల రమేష్, కుచలాపూర్ గ్రామ ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్రహార్, బోత్ మేజర్ గ్రామ మాజీ సర్పంచ్ మెరుగు నరసింహ దాసు, మహమ్మద్, అనిల్ అప్ప, అత్రం గంగారాం, గ్రామ పటేల్, ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.