చిత్రం న్యూస్, బోథ్: బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వసంత పంచమిని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి బాసర జ్ఞాన సరస్వతి కుంకుమను ,అమ్మవారి ఫొ టోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి MD హుస్సేన్, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్.టి. వి. ప్రసాద్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పలకలను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ వసంత పంచమి విశిష్టతను, జ్ఞానం, సంగీతం, కళ అభ్యాసానికి స్వరూపమైన సరస్వతీ దేవిని ఆరాధిస్తామని, విద్యా ప్రయాణాన్ని ప్రారంభిస్తారని, వసంత పంచమి జ్ఞానం విలువను ,సృజనాత్మకతను స్వీకరించాలని ,ప్రకృతి సౌందర్యాన్ని అభినందించాలని తెలియజేస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త జక్కుల వెంకటేష్ ,పోషకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

