పసిడి పరుగులు..
చిత్రం న్యూస్, వెబ్ డెస్క్: పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. 2025 ఆగస్టులో 10 గ్రాముల బంగారం ధర రూ.1,02, 650 2026 జనవరి నెల 22వ తేదీ నాటికి ఏకంగా 1,58,290 కి చేరుకుంది. నెలకు పదివేల రూపాయల చొప్పున ఇటు వినియోగదారులకు అటు వ్యాపారులకు అంతుచిక్కని మాదిరిగా బంగారం ధర పెరిగిపోవడంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతానికి మంచి రోజులు లేవని సరిపెట్టుకున్న కొద్ది రోజుల్లో శుభ ఘడియలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇలాంటి తరుణంలో రోజురోజుకు బంగారం ధర పెరుగుతుండడం పట్ల వినియోగదారుల్లో గుబులు రేపుతుంది ఈ ధర ఈ ఏడాది రెండు లక్షలకు చేరుతుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా అంతే వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.50 లక్షలకు చేరింది