చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేస్లాపూర్ నాగోబా జాతరకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో కలిసి వచ్చిన ఆయన గుడి హత్నూర్ బైపాస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అసిఫుల్లాఖాన్, గుడిహత్నూర్ సర్పంచ్ ఆడే శీల, గుడిహత్నూర్ మండల అధ్యక్షుడు కరుణాకర్, ఇచ్చోడ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.