Chitram news
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 3:40 pm Editor : Chitram news

భోరజ్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..సీఎంకు విన్నవించిన సర్పంచ్ చిటిమెల్లి సాయివర్మ 

చిత్రం న్యూస్, భోరజ్:ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండని సీఎం రేవంత్ రెడ్డికి గ్రామ సర్పంచ్ చిటిమెల్లి సాయివర్మ విన్నవించారు. శుక్రవారం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్గంగా నదిపై నిర్మించిన చనాఖా-కొరటా బ్యారేజి హత్తిఘాట్ పుంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి సర్పంచ్ సాయి వర్మ సమస్యలపై విన్నవించారు. నూతనంగా ఏర్పడిన మండలం కావడంతో సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, రహదారులు తాగునీటి సదుపాయాలు, డ్రైనేజి, విద్యుత్ సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, స్మశానవాటికకు వెళ్లేందుకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేసేందుకు తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని విన్నవించారు.