సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన లోక ప్రవీణ్ రెడ్డి
చిత్రం న్యూస్, భోరజ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్ గంగా నదిపై భోరజ్ మండలంలో నిర్మించిన చనాఖా- కొరటా బ్యారేజ్ హత్తిఘాట్ పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేసేందుకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ దగ్గర శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.