Chitram news
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 6:10 pm Editor : Chitram news

స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలి

చిత్రం న్యూస్, బేల: స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. యువతీ,యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ వివేకానందుని స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే ఏకైక సంఘం ఏబీవీపీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్ర శేఖర్, నాయకులు దత్తా నిక్కం,సందీప్ ఠాక్రే, రాము బర్కడే, నవీన్ పోత్ రాజ్, ఏబీవీపీ నాయకులు శివానీత్ వార్ ఓం ప్రకాష్, రేసు మనోజ్ రెడ్డి, తరుణ్, కట్కార్ల సాయి రెడ్డి, బాలాజీ, రేసు శివ రెడ్డి, ఉప్పల్ వార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

స్వామ