చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ అన్న బస్తీ బాట కంది శ్రీనన్న పాదయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కంది శ్రీనివాస రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబార్ రావు పాటిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, సాయి చరణ్ గౌడ్, సెడ్మకి ఆనందరావు, మునిగెల నర్సింగ్, గుడిపెల్లి నగేష్, మునిగెల విఠల్, షకీల్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు..

