Chitram news
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 9:41 pm Editor : Chitram news

జమ్మికుంటలో ఉత్సాహంగా సీఎం కప్ క్రీడా ర్యాలీ

చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ సీఎం కప్ టోర్నమెంట్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడా ర్యాలీని జమ్మికుంట పట్టణంలో  నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పేట సంఘం అధ్యక్షులు బాబు శ్రీనివాస్, పేట సంఘం సెక్రటరీ ఆడేపు శ్రీనివాస్ టార్చ్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ శ్రీలత మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం, రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా కార్యక్రమం రూపొందించారని, ఇందులో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, మంచి దేహదారుఢ్యాన్ని రూపొందించుకోవాలన్నారు. క్రీడల్లో రాణించి మన గ్రామానికి, మండలానికి, జిల్లాకి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ శ్రీలత , పీఈటీ భగత్, తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.