Chitram news
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 7:43 pm Editor : Chitram news

అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం_డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బిట్ల గంగన్న

  * ఘనంగా ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ జన్మదిన వేడుకలు

* అన్సారీ ఫౌండేషన్ ప్రారంభించిన ప్రముఖులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ తన జన్మదినం సందర్భంగా  అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్మల్  డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బిట్ల గంగన్న, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, జైనథ్ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి అన్నారు. అన్సారీ జన్మదిన వేడుకలను బంధు మిత్రులు, నాయకులు, శ్రేయోభిలాషుల నడుమ శనివారం జరుపుకున్నారు. అందరి నడుమ కేకు కట్ చేశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఫౌండేషన్ కరపత్రాలను అందరికీ అందజేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ..ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ ఇప్పటికే పాల ఉత్పత్తుల రంగంలో రాణిస్తున్నారన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల్లో అడుగుపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. అట్టడుగు వర్గాలకు సహాయం చేయడం. విద్యా, వైద్యం, ఆరోగ్యం సామాజిక ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సానుకూల, స్థిరమైన మార్పును తీసుకు రావడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుందని అన్సారీ ఫౌండేషన్ ఛైర్మన్  ఎండీ అన్సార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా.సంజయ్ గుజరాతి, ఎల్టి వెంకట్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, మహ్మద్ రోహిత్, మాజీ కౌన్సిలర్ మహ్మద్ షానవాజ్, షేక్ కిజర్ పాషా, షేక్ పర్వేజ్, గాజుల సాంబశివ, తలమడుగు సర్పంచ్ ఎలుగు చంటి (రాజన్న),  ఫౌండేషన్ సభ్యులు పి.సునీల్, ఎం.రాకేష్, శ్రీకాంత్, సుశీల్, టి.నారాయణరెడ్డి, సామ ఆశిష్ రెడ్డి, ఇర్ఫాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.