Chitram news
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 6:29 pm Editor : Chitram news

చైనా మాంజా తగిలి ఒకరికి తీవ్రగాయాలు

చిత్రం న్యూస్, నేరడిగొండ: సంక్రాంతి పండగ వేళ సరదా కోసం గాలిపటాలు ఎగరేస్తాం.అయితే,గాలిపటాలను ఎగరేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది.చైనా మాంజా.మనుషుల పాలిట యమపాశంగా మారింది.చైనా మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయి.చైనా మాంజా మహా డేంజర్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది.చైనా మాంజా కారణంగా నేరడిగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 రహదారి పై బైక్ మీద నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బక్పత్ కి చెందిన మొహమ్మద్ అనిస్ (42)కి పతంగి మాంజా అతడి మొహంపై చుట్టుకుంది. ఇది గమనించే లోపే తీవ్ర రక్తస్రావం అయ్యింది.వెంటనే బాధితుడిని మండల కేంద్రం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ దుస్థితి నెలకొనడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అత్యాశ. పతంగులు ఎగురవేసే వారి బాధ్యతారాహిత్యం అని చెప్పాలి. జనాల గొంతులు కోస్తున్న ఈ చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ చైనా మాంజా మార్కెట్ లో లభ్యమవుతోంది.ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. పోలీసులు చైనా మాంజా వాడొద్దని పదే పదే చెబుతున్నా వ్యాపారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. అయినా చైనా మాంజా వాడకాన్ని మాత్రం ఆపడం లేదు.