చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెంలోని రామాయలం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవరాజ్, ప్రధాన కార్యదర్శిగా గంగేశ్వర్, చిన్నయ్య, కోశాధికారులుగా రాజు, గణేష్, కిట్టు, రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ప్రసాద్, శ్రీరామ్, నల్లగొండ మోహన్ నాయక్, బ్రహ్మచారి బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యవర్గానికి గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహణకు నూతన కమిటీ కృషి చేయాలని భక్తులు, గ్రామస్తులు నూతన కమిటీ సభ్యులను కోరారు. అలాగే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.