చిత్రం న్యూస్, జైనథ్: మండలంలోని కూర గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం రోజున అన్నదానం పెద్ద ఎత్తున గ్రామస్తులు, దాతల సహకారంతో జరుగుతుందని ఆలయ కమిటీ, ప్రధాన అర్చకులు గుండేటి రామాంజనేయ శర్మ తెలిపారు. శనివారం కరంజి గ్రామానికి చెందిన నూతుల మహేందర్ రెడ్డి కుటుంబం, కరంజి, దీపాయిగూడ సుందర సత్సంగ్ భజనలతో ఆలయంలో శోభ సంతరించుకుంది. ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.


