జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్ల నిధులు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, జైనథ్: చారిత్రక ప్రసిద్ధి గాంచిన జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పునరుద్ఘాటించారు. ఆలయంతో పాటు కోనేరు అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు మంజూరైన నేపథ్యంలో శనివారం గ్రామస్తులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను, కోనేరు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ...