చిత్రం న్యూస్, ఆదిలాబాద్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థినీ, విద్యార్థులకు మధ్యాహ్నం పూట చికెన్ భోజనము ఏర్పాటు చేశారు. అనంతరం స్వీట్, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, సెక్రెటరీ శ్రీ దుర్గే భగవాన్ దాస్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, ప్రేమ్ రాజు గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి స్వామి, ఉపాధ్యాయులు, వాలంటీర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
