చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్, చిన్న బెల్లలు సర్పంచ్ బొంతల భూమన్న, పెద్ద బెల్లల్ సర్పంచ్ తిరుపతి తదితరులు కలిసి డిపో మేనేజర్ సరస్వతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. మెట్ పల్లి డిపో నుండి మెట్పల్లి, కోరుట్ల, పైడిమడుగు, రాయికల్ మీదుగా బోర్నపల్లి కడెంకు బస్సు సర్వీస్ నడపాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆమె వెంటనే బస్ సౌకర్యం కల్పించేలాచర్యలు తీసుకుంటానని చెప్పారు.
