చిత్రం న్యూస్, సాత్నాల: సర్పంచుల సంఘం సాత్నాల మండల కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండలంలోని కాన్ప మేడిగూడ(ఆర్) గ్రామంలోని రైతువేదికలో 10 మంది సర్పంచులతో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా కుంచాల మహేందర్, ఉపాధ్యక్షులుగా మెస్రం శ్యాంరావు, కామ్రే కిషోర్, కోశాధికారిగా ఆత్రం శ్యాంసుందర్ లను ఎన్నుకున్నారు. ఎన్నికైన మండల కమిటీ సభ్యులను సర్పంచులు ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు.

