చిత్రం న్యూస్, జైనథ్: రాత్రి పూట వీధి దీపాలు వెలగడం లేదని జైనథ్ మండలం కూర గ్రామంలోని కొత్త కాలనీవాసులు వాపోయారు. చీకట్లో బయటకు వెళ్లాలంటే జంకుతున్నామని, తమ సమస్యలు చెప్పినప్పటికీ పంచాయతీలో నిధులు లేవని సాకు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి లైట్లు వెలిగేలా ఏర్పాటు చేయాలని కొత్త కాలనీవాసులు కోరుతున్నారు.
