అధ్వానంగా బేల జాతీయ రహదారి..పట్టించుకునేవారేరి?
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని 353బీ జాతీయ రహదారి అధ్వాన్నంగా మారింది. శివాజీ చౌక్ నుంచి వెళ్లే రహదారిపై గుంతలు పడ్డాయి. మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో నీరు రోడ్డుపై చేరి గుంతలమయంగా మారింది. ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డు పరిస్తితి అధ్వానంగా మారిందని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వార్డు సభ్యులు, మాడ లక్ష్మీ, ఆత్రం దశరథ్ కోరారు.

