సోయా పంటను కొనుగోలు చేయాలని రేపు రైతులు, brs నేతల రాస్తారోకో..
చిత్రం న్యూస్, జైనథ్: రైతులు పండించిన సోయా పంటను ఎటువంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బేల, జైనథ్ మండలాల రైతులు BRS పార్టీ నాయకులు శుక్రవారం రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. BRS పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించనున్నారు. భోరజ్ నుండి బేల వెళ్లే 353బీ జాతీయ రహదారిపై మాకోడ, ఖాప్రి X రోడ్ వద్ద శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి ఈ ఆందోళన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బేల, జైనథ్ మండలాల రైతులు, BRS పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సోయా రైతులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టనున్నారు. ప్రభుత్వం తక్షణమే సోయా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయనున్నారు.
