నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేసిన సర్పంచ్ మాలేగం మధుప్రీతి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కీర్గుల్ (కె) గ్రామ సర్పంచ్ మాలేగం మధుప్రీతి, ఉపసర్పంచ్ కోప్లే నాగనాథ్ ను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రవళిక, భవానిలు గురువారం ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న1 నుండి ఐదో తరగతి విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులను సర్పంచ్ మాలేగం మధుప్రీతి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవందర్, అంగన్వాడీ టీచర్ ఈశ్వరబాయి. తదితరులు పాల్గొన్నారు.
