Chitram news
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 7:00 pm Editor : Chitram news

రబీ పంటలో శాస్త్రవేత్తల క్షేత్ర స్థాయి పర్యటన

చిత్రం న్యూస్, జైనథ్: వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిరాల, జైనథ్, లేఖర్ వాడ, సావాపూర్, కచ్ కంటి గ్రామాలలో శనగ, కంది, గోధుమ రబీ పంటలలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డా.కే రాజశేఖర్, డా.జి. ప్రవీణ్ కుమార్ లు  మాట్లాడుతూ..గులాబీ రంగు పురుగు దృశ్య పత్తి పంటను తీసివేయాలన్నారు. కంది పంటలో పురుగు నివారణకు లాండా సాయి హాలోత్రిన్ + క్రోరాంతనిప్రోలు ఎకరానికి 80 మిల్లీలీటర్లు విచికారి చేసుకోవాలన్నారు. సెనగ పంటలో ఎండు తెగులు నివారణకి కాపరాక్షి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మొదట్లో పిచికారి చేయాలన్నారు. గోధుమ పంటలో తెగుళ్ళ నివారణకి ప్రాపి కొనజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇక్రిసాట్ ఇచ్చిన కందిరకాలను కూడా సందర్శించారు. రైతులు పాల్గొన్నారు.