చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా గెలుపొందిన రెడ్డి బంధువులను రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రెడ్డి హాస్టల్ వసతి గృహ ప్రాంగణంలో జిల్లాలోని మొత్తం 50 మంది రెడ్డి బంధువులు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నికయ్యారు. వారందరినీ శాలువా, మెమొంటోతో రెడ్డి బంధువులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నల్ల నారాయణ రెడ్డి, గోపిడి రాం రెడ్డి, ఆర్థిక కార్యదర్శి ఎల్టి కిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి హాస్టల్ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లూరి భూపతిరెడ్డి, ఆర్థిక కార్యదర్శి విఠల్ రెడ్డి, రెడ్డి యువజన విభాగం అధ్యక్షులు క్యాతం శివప్రసాద్ రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు గోపిడి సవీన్ రెడ్డి, ఎల్మ సంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

