Chitram news
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 5:52 pm Editor : Chitram news

ఆదిలాబాద్ లో డీసీసీ కార్యాలయం ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవితేజ హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయాన్ని ఘనంగా  ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ డిసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్,  టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన, రైతు, కార్మిక, NSUI శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ పార్టీ జెండాను ఎగురవేసి కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.