Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి  నేతల యత్నం..అరెస్టు చేసిన పోలీసులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను వేధించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వంను కోర్టులు తప్పు పట్టడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేసి మావల పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబ గౌరవం తగ్గించడం కోసం గాంధీ కుటుంబం పై నేషనల్ హెరాల్డ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి గత పది సంవత్సరాలుగా వేధించే ప్రయత్నం చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈడీ, సీబీఐ వంటి సంస్థలని ఉపయోగించి ప్రతిపక్షాలని అణచి వేయాలని చూస్తోందని అన్నారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపురావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మావల మండల అధ్యక్షులు, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, గుడిహత్నూర్ మండల అధ్యక్షులు మల్యాల కరుణాకర్, టౌన్ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, వాసిం రంజాని, అడేళ్లు, వాసిం, అసిఫ్, మోసిన్, దోసలి సంతోష్, అలీం , రొడ్డ ప్రదీప్, ఫహీమ్, గంగన్న, ఆరే గంగన్న,రవి, రహీం, రహీం ఖాన్, సమీ ఉల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments