బోథ్ న్యూ కాలనీలో ఓటరు వినూత్న ప్రయత్నం
బోథ్ న్యూ కాలనీలో ఓటరు వినూత్న ప్రయత్నం చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలో గతంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ 15వ వార్డు సమస్యలను పట్టించుకోలేదని బిలాల్ దుకాణ యజమాని అజీమ్ ఆరోపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే అభ్యర్థులకు తన కాలనీ సమస్యలను స్పష్టంగా ఒక ప్లకార్డు మీద వ్రాసి చూపిస్తూ, “గెలిచిన తర్వాత ఈ గల్లీ సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తాం” అని హామీ తీసుకుంటున్నారు. ఆ హామీపై అభ్యర్థుల సంతకాలు తీసుకుంటూ...