Chitram news
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 2:06 pm Editor : Chitram news

దుప్పట్లు పంపిణీ చేసి..ఉదారత చాటుకుని 

చిత్రం న్యూస్, బేల: చలి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు చలి దుప్పట్లు పంపిణీ చేసే ఉదారత చాటుకున్నారు బేల మండలం అవాల్పూర్ గ్రామానికి చెందిన జై హనుమాన్ ఫర్టిలైజర్ యజమాని ఇట్టడి రాజారెడ్డి, ఆయన తనయుడు సుశాంత్ రెడ్డి.  గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 150 మంది వృద్ధులకు, పేదలకు వీటిని పంపిణీ చేశారు.  చలితో ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం చేయాలని తన తండ్రి సలహాతో దుప్పట్లు పంపిణీ చేశామన్నారు సుశాంత్ రెడ్డి. దుప్పట్లను పంపిణీ చేయడంతో వృద్ధులు, పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.